మాల ధరించి మండలం రోజులు అకుంఠిత దీక్షతో కఠినమైన నియమనిష్టలను పాటించి ఇరుముడితో సన్నిధానానికి వచ్చే స్వాముల కోరికలను నెరవేర్చడానికి పట్టబంధం కట్టుకుని తపోనిష్టతో ఉన్న కలియుగ దైవం శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి.
ఈ రోజున భారతదేశం నందలి అన్ని ప్రాంతాల నుండియే కాక విదేశాల నుంచి సైతం కోటానుకోట్ల మంది భక్తులు ప్రతి సంవత్సరం జనవరి 14 తేదీన శబరిమలలో వేంచేసియున్న శ్రీ అయ్యప్ప స్వామివారి దర్శనానికి, వారి దివ్య మకరజ్యోతి దర్శనానికి పెద్దపాదం ద్వారా, చిన్నపాదం ద్వారా వచ్చుచున్నారు. కాని శబరిమలలో ఉన్న వసతి సదుపాయాలు భక్తులకు సరిపోవడం లేదు. చాలా మంది భక్తులు ఏ సదుపాయము లేక స్వామి వారి సన్నిధిలో గడపడం కష్టముగా భావించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందలేక పోతున్నారు. ఈ పరిస్థితిని కొంతవరకైనా నిరోధించవలెనన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన సంస్థ ‘శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన సేవా సమితి’
మా ఈ ప్రయత్నం సఫలీకృతం కావడానికి మీ సంపూర్ణ సహకారాన్ని అర్ధిస్తున్నాము.

